కుదరదన్నారు... మద్ధతిచ్చేశారే.

November 28, 2014 | 04:44 PM | 34 Views
ప్రింట్ కామెంట్

అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. అంతకుముందే పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం బిల్లుపై మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కొద్దిసేపటి కిందట బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడారు. తరువాత విప్ ఉపసంహరించుకుని బిల్లుకు తమ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. ఉదయం దాకా మొండిగా ఉన్న వీరు సడన్ గా ఇలా మద్ధతు ఇవ్వడం ఏంటో. దీనివెనుక ఎవరి ‘హస్తం’ ఉందో ఎవరికి ఎరుక.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ