ఎవరి వల్ల గెలిస్తే ఏముంది ఎర్రన్న?

November 28, 2014 | 03:15 PM | 26 Views
ప్రింట్ కామెంట్

గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల కారణంగానే టీఆర్ఎస్ కి అధికారం దక్కిందని, లేకుంటే ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్న నేతలు ఎక్కడో ఉండేవారని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్రా ఉందన్న సంగతి మరచి, రాష్ట్ర సాధన ఘనత మాదేనని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసిందన్న ఎర్రబెల్లి, ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉన్నందున, రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. విపక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండవచ్చుగానీ, కాంగ్రెస్ తప్పులకే టీఆర్ఎస్ కు పట్టంగట్టారని అనుకోవడం జనాల్ని తక్కువ చేసినట్లే అవుతుంది కదా ఎర్రన్న!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ