పోయాడని పాడెక్కిస్తే... పైకి లేచి ప్రశ్నించాడు

February 04, 2015 | 11:28 AM | 65 Views
ప్రింట్ కామెంట్

చనిపోయాడని అనుకున్న తిరిగి బతికి రావటం మనం కొన్ని సందర్భాలలో చూస్తూనే ఉంటాం. కానీ, ఆ వ్యక్తిని సాగనంపేందుకు పాడే కట్టి దాని మీద ఎక్కించిన తర్వాత లేచి కూర్చుంటే. గుండెలు అదిరిపోవు. సరిగ్గా ఇలాంటి ఘటనే వరంగల్ లో చోటుచేసుకుంది. మరిపేట మండలం జీన్యాతండాకు చెందిన రైతు బానోతు ధర్మ తన వ్యవసాయబావిలో క్రేన్ సాయంతో పూడిక తీస్తుండగా బావిలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడు చనిపోయాడని తేల్చారు. దీంతో అతని దేహాన్ని ఇంటికి తెచ్చి పాడే మీద పడుకోబెట్టారు. ఇక పాడే ఎత్తే సమయంలో హఠాత్తుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. కూర్చుంటే కూర్చున్నోడు... ఎందకు ఏడుస్తున్నారని కుటుంబ సభ్యులను ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఒకింత భయం, మరోపక్క ఆశ్చర్యానికి లోనైయిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని మరోసారి ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ