కేసు పెట్టిందని కాల్ గర్ల్స్ సైట్లో భార్య ఫోటో పెట్టాడు

January 29, 2015 | 10:53 AM | 50 Views
ప్రింట్ కామెంట్

అదనపు కట్నం తెమ్మంటే కేసు పెట్టిందని భార్యపై ఆ భర్త కసి పెంచుకున్నాడు. పగబట్టిన ఆ భర్త తన భార్యపై వ్యభిచారి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. నీచంగా కాల్ గర్ల్స్ కు చెందిన ఓ వెబ్ సైట్లో భార్య ఫోటోను అప్ లోడ్ చేయటంతోపాటు ఆమె ఫోన్ నెంబర్ కూడా చేర్చాడు. విషయం తెలుసుకుని నిర్ఘాంత పోయిన ఆ భార్య మరోసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కక మానలేదు. హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన మురళికి నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఆ దంపతుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదనపు కట్నం తేవాలని భార్యను వేధించటం మొదలుపెట్టిన భర్త ఇటీవల మరీ రెచ్చిపోయి చిత్ర హింసలకు గురిచేయటం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించటంతో వారు అతడిపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తనపై కేసు పెట్టడం భరించలేని మురళి, నీచపు ఆలోచనకు దిగాడు. కాల్ గర్ల్స్ కు చెందిన వెబ్ సైట్లో అతని భార్య ఫోటోను ఆప్ లోడ్ చేయటంతోపాటు ఫోన్ నెంబర్ ను కూడా చేర్చాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ