సూదిగాడి నీడలు భాగ్యనగరంలో కూడా?

September 05, 2015 | 12:47 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Injection-psycho-in-telangana-also-attack-niharonline.jpg

మొన్నటి వరకు ఏపీ లో కలకలం రేపిన సిరంజీవి ఆగడాలు తెలంగాణకు పాకినట్లు కనిపిస్తున్నాయి. ఏపీలో వరుస దాడులు చేస్తున్న అతడి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇతడిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కానీ ఇంత వరకు సూదిగాడిని  మాత్రం పట్టుకోలేకపోయారు.

తాజాగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో నాలుగో తరగతి చదువుతున్న రమ్య స్కూల్ కు వెళుతుండగా ఆగంతకుడు సూదీతో దాడి చేశాడు. దీనితో ఆమె సృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు గమనించి రమ్యను ఆసుపత్రికి తరలించారు. ఏపీ రాష్ట్రంలో దాడులు చేస్తున్న వ్యక్తేనా ? లేక ఇతరులు ఉంటారా ? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు.ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో సిరంజితో ఓ వ్యక్తి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి అతనిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.  ప్రస్తుతం తెలంగాణలో జరిగిన సంఘటనతో అతడికి సంబంధం ఉందా అనేది తెలియ రాలేదు. సిరంజి తో విద్యార్థిని సృహ కోల్పోయిందా ? లేక ఇతర కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ