ఆ ఎమ్మెల్యే కేసీఆర్ ఒప్పుకుంటే దూరేస్తాడట

January 28, 2015 | 12:16 PM | 26 Views
ప్రింట్ కామెంట్

రాష్ట్రంలో గులాబీ ఆకర్ష్ కి టీడీపీకి చెందిన బడాబడా నేతలే వలసపోతున్నారు ఇక నేనేంత అనుకున్నాడో ఏమో. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జంపింగ్ పై ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుంటే అధికార పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశాడు. తన నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందుల గురించి అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు సొంత పార్టీ నేతలు తనకు అండగా నిలవలేకపోయారని, ఈ అంశంపై అసంత్రుప్తితోనే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు. ఆయనొక్కడే కాదంట, టీడీపీ ఎమ్మెల్యేలంతా గులాబీ బాస్ తో టచ్ లో ఉన్నారంటు బాంబు పేల్చేశాడు. రెండు రోజుల క్రితం నారా లోకేష్ ను కలిసినప్పుడు తాను టీఆర్ఎస్ లోకి వెళాతానని ఎన్నడూ అనలేదని మాధవరం స్టేట్ మెంట్ ఇవ్వటం కొసమెరుపు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ