అలర్ట్: ఆ మహమ్మారి ధాటికి భాగ్యనగరం వణికిపోతుంది

January 21, 2015 | 11:49 AM | 24 Views
ప్రింట్ కామెంట్

స్వైన్ ఫ్లూ ఇప్పడు హైదరాబాద్ నగరాన్నివణికించేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి మంగళవారం నలుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై చర్చించేందుకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ఈ పరిస్థితులపై కేసీఆర్... ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి వివరించారు. సాయం కోసం వైద్య బృందాలను పంపాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల కేసీఆర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై సమీక్ష జరిపి వెంటనే నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మరో 20 రోజులు చలిగాలులు ఉంటాయిని... ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గత రెండు నెలల నుంచి ఇప్పటి దాకా స్వైన్ ఫ్లూతో మొత్తం 26 మంది మృతి చెందారు. బయటికి వెళ్లేప్పుడు మొహనికి ఏదైనా అడ్డుపెట్టుకోవటం, ఆహర నియమాలు జాగ్రత్తగా పాటించటం ఇలా మీరూ జాగ్రత్తగా ఉండండి మరీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ