ఫీజు బకాయిల కోసం కృష్ణయ్య దీక్ష

January 18, 2015 | 09:50 PM | 38 Views
ప్రింట్ కామెంట్

ఫీజు రీఎంబర్స్ మెంట్ పై పోరాటానికి సిద్ధమవుతున్నాడు ఉద్యమ నేత కృష్ణయ్య . ఫీజుల బకాయిల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని… అసలు ఆ విషయం గురించి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. దీనికి నిరసనగా, ఈనెల 22 నుంచి నిరాహార దీక్షా చేస్తామని అన్నారు. దాదాపు వందమంది బీసీ సంఘాల నేతలతో దీక్ష చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 16 లక్షల మంది బకాయిల చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో బకాయిల చెల్లింపు పూర్తయి, కొత్త దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నదని అన్నారు. తెలంగాణలో మాత్రం విద్యార్ధుల భవిష్యత్ తో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆయన మండిపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ