27న తెలంగాణకు అమిత్‌షా

December 06, 2014 | 05:21 PM | 133 Views
ప్రింట్ కామెంట్

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారయింది. అమిత్‌ షా ఈ నెల 27, 28 తేదీలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. తొలుత అమిత్‌ షా 27న వరంగల్‌ లో పర్యటిస్తారు. వరంగల్‌ లో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడతారు. అంతేకాకుండా ‘వరంగల్‌ లో బీజేపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌ షా పరిశీలిస్తారని తెలుస్తుంది. అనంతరం 28న అమిత్‌ షా హైదరాబాద్‌ లో పర్యటిస్తారు. తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం చేపట్టవలసిన విధానాలను గురించి ముఖ్యనాయకులతో చర్చలు జరుపుతారని తెలుస్తున్నది.ఈసారి 10కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యంగా బీజేపి అడుగులు వేస్తున్నది. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించేందుకు బీజేపి కృషి చేస్తున్నది. ఇక దక్షినాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు’ 2019లో ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ