అనుమానపు మొగుడి అంగాన్ని కోసిపడేసింది

March 03, 2015 | 03:54 PM | 91 Views
ప్రింట్ కామెంట్
Woman_cut_husband_pennis_in_hyderabad

భర్త ఎంత హింసిస్తున్న ఓర్చుకుంటు సర్దుకుపోతున్న మహిళలున్న ఈ కాలంలో, అనుమానం పెంచుకున్న ఆ భర్త వేధింపులు భరించలేకపోయిందా భార్య. ఇక వేధింపులు ఎలాగూ ఆపలేను అనుకొని అతనికి తగిన శాస్త్రి చేయాలనుకుంది. దీంతో ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెహదీపట్నం అంబేద్కర్ నగర్ లో సత్తయ్య జంట కాపురముంటుంది. కూలీ పనులు చేసే సత్తయ్య(35) ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్ గా పనిచేసే భార్యపై(30) అనుమానం పెంచుకున్నాడు. అంతేకాదు నిత్యం మద్యం సేవించి ఆమెను వేధించటం ప్రారంభించాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా అతడు ఆమెను వేధించసాగాడు. దీంతో సహనం నశించిన అనసూయ, మద్యం మత్తులోవున్న సత్తయ్య మర్మాంగాన్ని కత్తితో కోసింది. ఆ తర్వాత పిల్లలను తీసుకుని ఎటో వెళ్లిపోయింద. ఇంట్లోంచి వస్తున్న మూలుగులు విన్న చుట్టుపక్కలవారు తలుపు బద్దలు కొట్టిచూడగా, తీవ్రరక్తస్రావంలో పడివున్న సత్తయ్యను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సత్తయ్య సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుప్రారంభించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ