ఎటిఎం సెంటర్లో మహిళపై దాడి

May 20, 2015 | 01:22 PM | 28 Views
ప్రింట్ కామెంట్
sbi_atm_niharonline

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో కాల్పుల కలకలం రేగింది.  మధురానగర్ కు చెందిన శ్రీలలిత అనే యువతి డబ్బులు డ్రా చేసేందుకు ఎటిఎం లోపలికి వెళ్ళగానే గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె వెనుకే ఎటియంలోకి చొరబడ్డాడు. శ్రీలలితను తుపాకీతో బెదిరించి ఎటియం కార్డు, నగదు, నగలను లాక్కుని పరారయ్యాడు.  యువతి దగ్గర దొంగిలించిన ఏటీఎం కార్డుతో దుండగుడు మరో ఏటీఎం నుంచి రూ.2500 డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెస్ట్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో పాటు వేలిముద్రల నిపుణుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దుండగుడు నాటు తుపాకీతో దాడి జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ