పవన్ దర్శనానికి కోట్లు కుమ్మరిస్తున్నారు

November 20, 2014 | 11:29 AM | 38 Views
ప్రింట్ కామెంట్

పవన్ కళ్యాణ్-వెంకీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గోపాలగోపాల చిత్రం సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. అస్తికత్వం కి నాస్తికత్వం మధ్య జరిగే కథాంశంతో నడిచే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ శ్రీక్రుష్ణుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇంకా కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఈ చిత్ర విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఇక, ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. చిత్రంలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ ను చాలా రీచ్ గా తీయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దేవుడి పాత్రలో పవన్ తెరమీద కనబడే ద్రుశ్యాన్ని చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనుకావాలని, ఇందుకోసం ఎంత ఖర్చైనా ఫర్వాలేదని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు భారీగా ఖర్చుపెట్టి స్రుష్టి వీఎఫ్ఎక్స్ అనే సంస్థకు ఈ ఇంట్రడక్షన్ సీన్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైన్ చేయాల్సిందిగా కోరారని సమాచారం. గతనెలలో విడుదలైన కార్తికేయ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది ఈ సంస్థే. ఇది ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకేనా, లేక థియేటర్లకు రప్పించేందుకు చేసే స్టంటా అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు ఒపికపట్టాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ