పనామా కాలువలో మరో బాలీవుడ్ కపుల్

May 04, 2016 | 12:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ajay-kajol-panama-papers-niharonline

విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను బయటపెడుతున్న ‘పనామా పేపర్స్’ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టింది. ఇందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా మినహాయింపు ఏం కాదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ తదితరుల పేర్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, 6వ జాబితాలో మరికొంత మంది పేర్లను బయటపెట్టింది. అందులో బాలీవుడ్ హీరో హీరోయిన్లు, దంపతులు అయిన అజయ్ దేవగణ్, కాజోల్ పేర్లు ఉన్నాయి.

అజయ్ తన కంపెనీ నిసా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. పనామా బయటపెట్టిన వివరాలపై ఆయన స్పందిస్తూ..  తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని చెప్పారు. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ