బన్నీకి సెంటిమెంట్ భయం పట్టుకుంది

April 11, 2016 | 02:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
allu-arjun-fears-geetha-arts-sentiment-niharonline

వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టి మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అయిపోతున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడున్న హీరోల్లో సీనియర్లతో సహా ఏ హీరో ఇవ్వని వరుస మూడు 50 కోట్ల మార్క్ చిత్రాలను అందించాడీ స్టైలిష్ స్టార్. ఇప్పుడు అదే ఊపులో సరైనోడుగా రాబోతున్నాడు. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కేథరిన్, రకుల్ హీరోయిన్లుకాగా, నటుడు శ్రీకాంత్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆడియోసక్సెస్ మీట్ ను వైజాగ్ లో నిర్వహించగా, మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్ గా హాజరై బన్నీకి అశీస్సులు అందజేశాడు. అయితే చిత్ర విడుదల దగ్గర పడుతున్న సమయంలో బన్నీకి ఇప్పుడు  కొత్త టెన్షన్ పట్టుకుంది.

                  సరైనోడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంది. అది బన్నీ హోం బ్యానర్. గతంలో బన్నీ ఈ బ్యానర్ లో మూడు చిత్రాలు తీశాడు. అందులో డెబ్యూ మూవీ గంగోత్రి కూడా ఉంది. గంగోత్రి రాఘవేంద్ర రావు భాగస్వామ్యంతో అల్లు అరవింద్ నిర్మించాడు. అయితే కీరవాణి పాటల పుణ్యమాని సినిమా యావరేజ్ మార్క్ తో గట్టెక్కింది. ఇక తర్వాత వచ్చిన హ్యాపీ ఫ్లాప్ అవ్వగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బద్రీనాథ్ ఘోరంగా బోల్తా పడింది. దీంతో స్వీయ బ్యానర్ లో సినిమాలంటే బన్నీకి కాస్త భయం పట్టుకుందట. కానీ, సరైనోడు పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాతో కావటంతో ధైర్యం చేసి ముందుకు వచ్చాడు బన్నీ. కానీ, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో గతం తలుచుకుని కొంచెం భయపడుతున్నాడంట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ