దేవుడు శాసిస్తాడు... రజనీ పాటిస్తాడు

November 17, 2014 | 11:43 AM | 50 Views
ప్రింట్ కామెంట్

తన రాజకీయ ఆరంగ్రేటం గురించి తీవ్ర చర్చ నెలకొన్న నేపథ్యంలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గళం విప్పాడు. దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేస్తానని ప్రకటించాడు. ఆదివారం లింగా ఆడియో వేడుకలో మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘ఈ వేదికపై చాలా మంది రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే రాజకీయాలంటే నాకేమీ భయం లేదు పైగా వాటి లోతు కూడా నాకు తెలుసు. సినిమా చేయడంలాగే రాజకీయ రంగ ప్రవేశం కూడా కష్టసాధ్యం కాదు. అయితే దానిని జయించడమే ముఖ్యం’ అని పేర్కొన్నారు. దీని కోసం పలు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లోకి చేరి ప్రజా సేవ చేస్తానని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. కొన్ని పరిస్థితులే తననీ స్థాయికి నిలబెట్టాయని, అదే విధంగా రేపటి పరిస్థితుల్లో ఏ స్థాయికి చేరుస్తాయో తెలియదన్నారు. అయితే ఖచ్చితంగా తనను నమ్మిన వాళ్లకు మాత్రం సేవ చేస్తానని రజనీ చెప్పారు. ఇంతకీ వస్తాడా?రాడా?. ఓహ్ ! దేవుడే నిర్ణయించాలి కదా...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ