చిరు బాటలో బుడ్డోడు

November 17, 2014 | 12:12 PM | 53 Views
ప్రింట్ కామెంట్

అగ్రతారగా వెలుగొందుతున్న తొలినాళ్లల్లోనే మెగాస్టార్ చిరంజీవి పారితోషకంగా డబ్బు బదులు నిజాం హక్కులను తీసుకునేవాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే సాంప్రదాయానికి మరో బడాహీరో తెరలేపాడు. లేటేస్ట్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చిరునే ఫాలో అవ్వాలనుకుంటున్నాడాట. తదుపరి చిత్రానికి అడ్వాన్స్ గా నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తీసుకున్న పారితోషకాన్ని తిరిగి ఇచ్చేసి నిజాం హక్కులు పొందాడట. అంతేకాదు ఇకపై రాబోయే సినిమాలకు కూడా ఇదే పద్ధతి అనుసరించాలని తారక్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. ఇక డైరక్టర్ పూరిజగన్నాథ్ కూడా రెమ్యునరేషన్ బదులు సీడెడ్ హక్కులు పొందాడని సమాచారం. ఇటీవల భారీ చిత్రాలు బోల్తా పడుతుండంతో నిర్మాతలు, పంపిణీ దారులకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇకపై ఇలాంటివి రీపిట్ కాకుండా ఉండే చర్యలలో భాగంగా నిర్మాతల మండలి తీసుకున్న కఠిన నిర్ణయాలే వల్లే ఇలా వీరు పంపిణీ హక్కుల మీద పడ్డారని టాలీవుడ్ టాక్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ