శృంగార తారపై పరువు నష్టం దావా

April 05, 2016 | 11:55 AM | 3 Views
ప్రింట్ కామెంట్
sunny-leone-pooja-mishra-niharonline.jpg

బాలీవుడ్ సెక్సీ నటి సన్నీ లియోన్ పై పరువు నష్టం దావా దాఖలైంది. ప్రముఖ మోడల్ పూజా మిశ్రా బాంబే హైకోర్టులో ఈ దావాను దాఖలు చేసింది. తన పరువుకు నష్టం కలిగించేలా సన్నీ వ్యవహరించిందని,  అందుకుగానూ రూ.100 కోట్లు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె పిటిషన్ లో కోరింది.

ఇంతకీ అసలు కారణం ఏంటంటే... గతంలో వీరిద్దరు కలిసి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. అప్పుడు తనపై సన్నీ లియోన్ పలు మీడియా సంస్థల్లో పరువు నష్టం కలిగించే రీతిలో ఇంటర్వ్యూలను ఇచ్చిందని మిశ్రా ఆరోపణ. అంతేకాదు తనపై లేనిపోనివి ఆపాదిస్తూ ఓ దినపత్రికలో సన్నీ ఆర్టికల్ ను రాసిందని అందుకే పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొంది.

                                     ఈ అసత్య ఆరోపణల వల్లే మనో వేదనకు గురైన తాను తన పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ను తాను ఉపసంహరించుకున్నానని, ఈ కారణంగా తనకు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బజారుకీడ్చిన సన్నీ లియోన్ పై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 120బీ( కుట్ర) ల కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆమె కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ నరేశ్ పాటిల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ