విషం తాగి ఆత్మహత్య చేసుకున్న నటుడు

March 14, 2016 | 12:00 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Tamil-serial-actor-sai-prashanth-suicide-niharonline

రంగుల ప్రపంచంలో హంగులే కాదు, వాటి వెనకాల ఉన్న విషాదగాథలు కూడా ఎన్నో. నటీనటులు తమ వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలతో అర్థాంతరంగా తనువు చాలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు రంగనాథ్ ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మరిచిపోక ముందే అలాంటి ఉదంతమే మరోకటి జరిగింది. భార్య దూరంగా ఉండటంతో ఒంటరితనం భరించలేని ఓ టీవీ నటుడు విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు.  

తమిళ టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి ప్రశాంత్ తన నివాసంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. మద్యంలో విషం కలుపుకుని ప్రశాంత్ తాగాడని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఒంటరితనాన్ని భరించలేక ఈ పని చేసుండవచ్చని బంధువులు చెబుతున్నారు. కాగా, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్, మూడు నెలల క్రితం మరో విసాహం చేసుకున్నాడు. అయితే ఆమె కూడా ప్రశాంత్ తో ఉండటం లేదని తెలుస్తోంది.

                 వీడియో జాకీగా కెరీర్‑గా ప్రారంభించిన సాయి ప్రశాంత్  తమిళంలో అనమలై, సెల్వి, అరసి తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో పాటు నీరం, తేగిడి, వడాకర్రీ తదితర సినిమాల్లోనూ ప్రశాంత్ నటించాడు. ప్రశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగితే అన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ