టెంపర్ రైట్స్ పూరీ చేతిలో

February 02, 2015 | 02:14 PM | 30 Views
ప్రింట్ కామెంట్

టెంపర్ ట్రైలర్లు చూడ్డం, దీన్ని ఒకే రోజులో 5 లక్షల మంది వీక్షించడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిజానిజాలేమిటో తెలియదుగానీ, ఈ చిత్రంపై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పంపిణీ సంస్థ సురేష్ మూవీస్‌తో కలిసి పూరీ జగన్హనాథ్ దీని హక్కులను రెండున్నర కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ డైరెక్టర్లు సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరగకపోవడంతో టెంపర్ సినిమా బాగా ఆడుతుందనే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా హక్కులు తీసుకున్నారని అనుకుంటున్నారు. మరోవైపు ‘టెంపర్' చివరి షెడ్యూల్‌కు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ వద్ద డబ్బు లేకపోవడంతో పూరి కొంత మొత్తాన్ని పెట్టాడని, ఇందులో భాగంగానే ఈ విధంగా సెటిల్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 13న ప్రపంచ వ్యాపితంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ