టైటిల్ మార్చి మళ్లీ రిలీజ్ చేస్తున్నారు

March 03, 2016 | 12:18 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Yemito-Ee-Maya-rajadhi-Raja-niharonline

శర్వానంద్, నిత్యామీనన్ ఈ ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఇద్దరి చిత్రాల్లో కథ, కథనం, పాత్రల స్వభావం చాలా ప్రాముఖ్యతతో కూడుకుని ఉంటుంది. అందుకే వీరిద్దరి చిత్రాలపై యూత్ కి ప్రత్యేక గురి. అంతేందుకు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమోషన్స్ అద్భుతంగా పండించారీ హిట్ పెయిర్. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదేం కొత్త చిత్రం కాదు లేండి. ఓ రెండేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆటోగ్రాఫ్ చిత్రాన్ని  తెరకెక్కించిన చేరన్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రంగా ఇది రూపొందింది.  ‘ఏమిటో ఈ మాయ’గా ఇది తెలుగులో రావాల్సింది. కానీ అది వీలుపడలేదు. తమిళ్ లో ‘ఏక్ ఉనుమ్ నన్ బనిన్ వాజక్కయ్’ గా తీసిన ఈ చిత్రాన్ని నేరుగా డీవీడీ రూపంలో రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యంతరంతో అదీ ఆగిపోయింది. ఇక ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత రీల్ కు మోక్షం కల్పించేందుకు సిద్ధపడ్డారు. వీరిద్దరి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండు భాషల్లోను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. తెలుగులో టైటిల్ ను మార్చేసి 'రాజాధి రాజా'గా మార్చేశారు.  స్టార్ కమెడియన్ సంతానం ఓ కీలకపాత్ర పోషిస్తుండగా, స్నేహ ఆమె భర్త ప్రసన్న గెస్ట్ రోల్ లో నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. రాజా సిరీస్ లో వరుస హిట్లు కొడుతున్న శర్వాకి ఇది హ్యాట్రిక్ అవుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ