ఐదేళ్ల తర్వాత కెమెరా ముందుకు

December 08, 2014 | 05:05 PM | 79 Views
ప్రింట్ కామెంట్

మూడేళ్లుగా ఓ పాపకు తల్లిగా తలమునకలై ఉన్న ఐశ్వర్య తిరిగి మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని కరన్ హ్యాపీగా అందరికీ అనౌన్స్ చేశాడు. కరన్ తీయబోతున్న యే దిల్ హై ముష్కిల్ మూవీలో అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్‌లతో బాటు ఐశ్వర్యా రాయ్ బచన్‌ని కూడా తీసుకున్నాడు. ఆమె తన సినిమాకు డేట్స్ ఇవ్వడమే చాలా గొప్పగా ఫీలవుతున్నాడు కరణ్. ఈ సినిమా మే 2015 నుంచి ఫ్లోర్ మీదకు వెళ్తుందనీ, షూటింగ్ లండన్‌లో మొదలవుతుందని అంటున్నారు. గుజారిష్ సినిమాలో నటించిన ఐశ్వర్య మళ్లీ మూడేళ్ల గ్యాప్ తరువాత మేకప్ వేసుకుంది. ఆరాధ్య పుట్టిన తరువాత తనను దూరంగా పెట్టి సినిమా షూటింగ్ లకు వెళ్ళడం ఇష్టం లేని ఐశ్వర్య ఆఫర్లు వచ్చినా దూరం పెడుతూ వచ్చింది. కరన్, ఐశ్వర్యకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం, ఫ్యామిలి డిస్ర్టబ్ కాకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాననడంతో అతని సినిమాకు అంగీకరించింది. మరో చిన్నవిషయం.. కరన్ జోహార్ సినిమా యేదిల్ ముష్కిల్ కంటే ముందే అంటే 2015 జనవరిలో మొదలవుతున్న సంజయ్ గుప్తా సినిమా జజ్ బాజ్ లో యాక్ట్ చేస్తున్నట్టు మరో వార్త. మళ్ళీ సినిమా ఛాన్సులు మొదలవడంతో తన ఫిట్ నెస్ కోసం, మరింత అందంగా కనిపించడం కోసం చాలా కసరత్తులే చేస్తోందట ఐశ్వర్య.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ