అఖిల్ అదే ఫిక్సయితే కష్టం!

March 29, 2016 | 12:33 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Vamsi-paidipalli-akhil-niharonline

ఆరంభంలో చాలా ఆర్భాటం చేసినప్పటికీ కథలో పస లేకపోవటంతో వినాయక్ లాంటి స్టార్ డైరక్టర్ చేతుల మీదుగా అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో నటవారసుడి రెండో చిత్రంపై ఆచితూచీ అడుగులేస్తున్నాడు నాగార్జున. రెండవ సినిమా గురించి కథలు కథలు వినిపించినప్పటికీ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసే కన్నా మంచి కథతో ముందుకు వెళ్లాలని అఖిల్ కి సూచించాడంట. ఆ మధ్య సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణతో సినిమా ఉండొచ్చని ఊహగానాలు వినిపించినప్పటికీ, ఇప్పుడు వంశీపైడిపల్లి పేరును పరిశీలించినట్లు సమాచారం. ఇందుకోసం వంశీ మరో రీమేక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో ఘన విజయాన్ని అందుకున్న 'యే జవానీ హై దివానీ' తెలుగు రీమేక్ గా ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

                       రణబీర్ కపూర్ దీపికా జంటగా ఈ సినిమాను, కరణ్ జోహార్ నిర్మించాడు. నిజానికి ఈ సినిమాను, అఖిల్ తో రీమేక్ చేయనున్నట్టుగా కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఖాయం కానున్నట్టు చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ రీమేక్ ను 'ఊపిరి'గా సమర్థవంతంగా తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, ఈ బాలీవుడ్ రీమేక్ ను కూడా జనరంజకంగా తెరకెక్కించగలడనే నమ్మకంతో ఉన్నారట. ఏప్రిల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుందని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ