అల్లువారబ్బాయి మరో మగధీర?

April 28, 2016 | 04:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
allu-sirish-4th-film-launched-niharonline

మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లువారబ్బాయి శిరీష్ చేసిన రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో ఎంటర్ టైనర్ కథను నమ్ముకుని పరుశరాం దర్శకత్వంలో శ్రీరస్తు... శుభమస్తు చిత్రంలో నటించబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ లోపు మరో చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు ఈ సినిమాను లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా .. శ్రీను వైట్ల స్విచ్చాన్ చేయగా, మారుతి గౌరవ దర్శకత్వం వహించాడు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా, ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డితో తనకి మంచి పరిచయం ఉందనీ .. అంతకన్నా ఎక్కువగా ఆయనపై నమ్మకం వుందని చెప్పాడు. ఇది పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ అనీ .. మగధీరలాగా 700 యేళ్ల నాటి చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్న చిత్ర యూనిట్ , జూలై మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ