చెర్రీ రైనాను మరిపిస్తాడా!

December 06, 2014 | 04:14 PM | 44 Views
ప్రింట్ కామెంట్

జంజీర్ చిత్రాన్ని (తెలుగులో తుఫాన్ ను కూడా) జనాలు మరిచిపోయి చాలా రోజులైంది. బాలీవుడ్ లో రాంచరణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడా అని మెగా అభిమానులు అనుకుంటుండగా ఇప్పుడో వార్త బయటికి వచ్చింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత గాథను ‘ఎం.ఎస్.ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి రాంచరణ్ సంతకం చేశాడని తెలుస్తోంది. ధోనీ పాత్రకు అనుకుంటే మీరు బురదలో కాలేసినట్లే. స్టైలిష్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా పాత్రలో రాంచరణ్ అలరించబోతున్నాడని సమాచారం. శీనువైట్లతో మూవీ కి చాలా టైం ఉందని అల్రెడీ చరణ్ హింట్ ఇచ్చేశాడు. మరి ఈ గ్యాప్ లో చరణ్ ఏం చేస్తాడని ఫ్యాన్స్ డౌట్. ఇప్పుడా డౌట్ క్లియర్ అయి పోయినట్టే. ఈ గ్యాప్ లో మనోడు ధోనీ చిత్రాన్ని లాగించేద్దామనుకుంటున్నాడట. మైదానంలో ధోనీ-రైనా కాంబినేషన్లో భారత్ ఎన్ని విజయాలు నమోదు చేసిందో మనందరికీ తెలుసు. అలాగే వారిద్దరు బయట కూడా అంతే మంచి స్నేహితులు. దీంతో రైనా పాత్రకు కూడా ప్రాధాన్యత ఉందని భావించిన చెర్రీ ఓకే చెప్పాడట. మరీ మొన్న మేముసైతం క్రికెట్ మ్యాచ్ ల్లో ప్రొఫెషనల్ క్రికెటర్ లా క్యాచ్ లు అందుకున్న రాంచరణ్ రైనా పాత్రలో కూడా అదరగొట్టాలని ఆశిద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ