ఆఖరికి శీనుకే చెర్రీ ఓకే

November 19, 2014 | 10:44 AM | 52 Views
ప్రింట్ కామెంట్

ఆగడు ఫ్లాప్ తో అడ్రస్ లేకుండా పోతాడనుకున్న దర్శకుడు శ్రీనువైట్లకు మెగా కాంపౌండ్ ఆహ్వానం పలికింది. హీరో రాంచరణ్ తన తదుపరి చిత్రం వైట్లతోనే చేయాలని డిసైడ్ అయ్యాడట. గోవిందుడు అందరి వాడేలే చిత్రం తర్వాత రాంచరణ్, శ్రీను దర్శకత్వంలోనే నటిస్తాడని తెలిసిందే. ఇక ఆగడు ఘోర పరాజయం తర్వాత చరణ్ ఆలోచనలో పడ్డాడని, మిగతా హీరోలు కూడా శీను వైపు కన్నెతి చూడటం లేదని గాసిప్స్ వినిపించాయి. అయితే గొవిందుడు.. లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత పూర్తిస్థాయి మాస్ కథాంశం ఉన్న చిత్రంలో నటించాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడట. అంతేకాదు నటుడిగా తనను తాను పూర్తిస్థాయిలో నిరూపించగలిగే కమర్షియల్ హంగులతోపాటు వినోదాత్మకమైన కథాంశంతో రావాలని వైట్లకు చెర్రీ సూచించాడట. కిక్, రేస్ గుర్రం చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించే పనిలో ఉన్నాడు. కథ కూడా చివరి దశలో ఉందని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ చివరికల్లా సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ