సర్దార్ తర్వాత సరైనోడి కోసం...

April 09, 2016 | 12:29 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chiru-chief-guest-for-allu-arjun-sarrainodu-audio-success-meet-niharonline

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'సరైనోడు' సినిమా పాటలను ఈ నెల 1వ తేదీన నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నిర్మించిన ఈ చిత్రానికి ఆడియో పంక్షన్ ని నిర్వహించకుండా ఇలా సింపుల్ గా విడుదల చేయటంపై బన్నీ ఫ్యాన్స్ బాగా అప్ సెట్ అయ్యారు. పైగా దానికి కారణం ఏంటో కూడా వివరించలేదు ఆ చిత్ర యూనిట్. అయితే థమన్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావటంతో ఈ నెల 10వ తేదీన ఆడియో సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. వైజాగ్ లోని ఆర్.కె.బీచ్ లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు. ఈ వేడుకకు అదనపు ఆకర్షణ ఇప్పుడు జతకానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రానున్నారంట. మీడియాలో ఈ వార్త ఇంతవరకు హల్ చల్ చేయనప్పటికీ, ఇందుకు సంబంధించిన హోర్డింగ్స్ ఇప్పుడు బీచ్ రోడ్డులో దర్శనమివ్వటంతో చిరు హాజరు కావటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

                      బన్నీకి చిరంజీవి అంటే ఎంత ప్రత్యేక అభిమానమో తెలియంది కాదు, పైగా గీతా ఆర్ట్స్ ఇంటి బ్యానర్ కావటంతో వెళ్తున్నాడంట. మొన్నే సర్దార్ ఆడియో పంక్షన్ కి హాజరయి అభిమానులకు బూస్ట్ ఇచ్చిన చిరు. ఇప్పుడు సరైనోడి కోసం కదటంతో అభిమానుల్లో సందడి నెలకొంది. మెగా హీరోల చిన్న చిన్న గ్యాప్ లు ఏర్పాడ్డాయన్న వదంతుల నేపథ్యంలో చిరు ఈ పంక్షన్ కి హాజరయితే మాత్రం వాటిని పటాపంచల్ చేయటం ఖాయం. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ చిత్రాల దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలయ్యే అవకాశం ఉంది. రకుల్, కేథరిన్ లు హీరోయిన్లు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ