టాలీవుడ్ దర్శకుడిపై క్రిమినల్ కేసు నమోదు

April 26, 2016 | 10:33 AM | 2 Views
ప్రింట్ కామెంట్
criminal_case_against_director_teja_niharonline

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు నమోదైంది. తేజ నుంచి తనకు ప్రాణ హాని ఉందని కలప వ్యాపారి అయిన కృష్ణారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెం 9లో నివాసముంటున్న కృష్ణారావుకి, దర్శకుడు తేజకి మధ్య ఓ ఇంటికి సంబంధించి వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది కూడా.  

ఇదిలా ఉండగా ఈ నెల 7న రాత్రి ఫిలింనగర్ ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం:12 వైపు వెళుతున్న కృష్ణారావును విక్కీ అనే వ్యక్తి అటకాయించాడంట. తేజతో ఉన్న వివాదాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలని, లేని పక్షంలో వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లు చూస్తూ ఉరుకోవని హెచ్చరించాడంట. ఆపై ఈ నెల 13న తేజ కూడా కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించారంట. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ కృష్ణారావు సోమవారం జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తేజ సహా వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా, వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ