ఆత్మ బంధం తెంచేసుకుంటున్న లిజీ

December 02, 2014 | 12:42 PM | 106 Views
ప్రింట్ కామెంట్

ఆత్మ బంధం సినిమాతో తెలుగు తెరకు సుపరిచితురాలైన సినీ నటి లిజి, ఆమె భర్త నిర్మాత ప్రియదర్శన్ విడాకుల కోసం ఫామిలీ కోర్టు మెట్లెక్కారు. ఇరువురూ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు లిజీ వివరించింది. ‘‘ఎంతో లోతుగా ఆలోచించి తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయానికి వచ్చాం... మంగళవారం చెన్నై ఫామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాం. మా పిల్లలు, దగ్గరి బంధువులు, స్నేహితుల సంప్రదింపులతో ఈ నిర్ణయానికి వచ్చాం. కలిసి బతకడానికి సాధ్యపడదని నిర్ణయించుకున్నాకే ఈ అభిప్రాయానికి వచ్చాం. మా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతున్నాను’’ అని అన్నారు. నిజానికి ఈ సమస్య ఒక సంవత్సరం పాటుగా నలుగుతోంది. కానీ ఇప్పటికది బయటపడింది. వీరిరువురికీ 1990లో పెళ్ళి జరిగింది. అప్పటినుంచి లిజీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు తను కేరళనుంచి ఆడుతున్న సిసిఎల్ కు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు సిద్ధార్థ, కుమార్తె కళ్యాణి. సిల్వర్ జూబ్లీ చేసుకోవాల్సిన సమయంలో ఈ విడాకుల గొడవేంటని అంతా చోద్యంగా చూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ