విషాదంతో వాటికి అవాంతరం

December 09, 2014 | 02:41 PM | 79 Views
ప్రింట్ కామెంట్

హరికృష్ణ తనయుడు జానకిరాం మృతి వల్ల నందమూరి వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ను షూటింగ్ విషయంగానీ సినిమాలగురించి గానీ అడిగే ధైర్యం ఎవరూ చేయలేక పోతున్నారు. టెంపర్ సినిమా చివరి దశలో ఉంది. ఈ ప్రమాదం కారణంగా ఆయనను సంప్రదించలేక షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అనే విషయాన్ని ఆయనకే వదిలేశారు. నిజానికి ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా షూటింగ్ 15-20 రోజులు పడుతుంది. దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే గానీ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి వీలవుతుంది. ఇక నందమూరి వారి మరో హీరో కళ్యాణ్ రాం సినిమా పటాస్ ఆడియో కూడా ఈ నెలలోనే విడుదల చేయాల్సి ఉంది. అన్నయ్య మరణం కళ్యాణ్ రాంను తీవ్రంగా క్రుంగదీసింది. ఇప్పట్లో హరికృష్ణ కుటుంబంలోని వారు కోలుకునే స్థితి కనిపించడం లేదు. దీంతో టెంపర్, పటాస్ సినిమాలకు ఈ ప్రభావం చాలానే ఉంటుందని సినీ వర్గాల్లో చర్చానీయాంశం అయ్యింది. ఇక ఈ రెండు చిత్రాల ఆడియోను పంక్షన్లు నిర్వహించకుండా నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని ఆయా చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ