‘మేము సైతం’ అన్న కమల్, సూర్య

November 28, 2014 | 04:52 PM | 42 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్‌ చేపట్టిన హుద్‌హుద్‌ బాధితుల సహాయ కార్యక్రమానికి కోలీవుడ్‌ నటులు కూడా మేముసైతం అంటున్నారు. దీనిలో భాగంగా సౌత్‌ఇండియన్‌ బెస్ట్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మ్యూజిక్‌తో సౌత్‌లో అందర్ని మెప్పించగల సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌. దేవీ ట్యూన్‌లకు ఎవరైనా కాళ్లు, చేతులు ఊపాల్సిందే. అలాంటి దేవీశ్రీ ప్రసాద్‌ తో కమల్‌ హాసన్‌ గొంతు కలిపితే కన్నుల పండుగలా ఉంటుంది. ఇలాంటి అరుదైన కలయికకి మేము సైతం కార్యక్రమం వేదికగా మారింది. నవంబర్‌ 30న జరిగే ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీ కూడా రావడం సినీ పరిశ్రమకే చెప్పుకోదగ్గ విశేషం. అందులోనూ కమల్‌ దేవీతో కలిసి లైవ్‌ ఫెర్మారెన్స్‌ ఇవ్వడం చాలా సంతోషకరమైన వార్తగా చెప్పుకోవచ్చు. హుధూధ్ తుపాను బాధితులకు ఇంతకు ముందే సూర్య అండ్‌ ఫ్యామిలీ సాయం చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ