ఆ వార్త నిజం కాదు: మణిరత్నం కుటుంబ సభ్యులు

May 06, 2015 | 03:13 PM | 144 Views
ప్రింట్ కామెంట్
suhasini_maniratnam_niharonline

తీవ్రమైన ఛాతినొప్పితో ఏస్ డైరెక్టర్ మణిరత్నం ఆసుపత్రి చేరారంటూ వచ్చిన వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. హెల్త్ చెకప్ కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన వెళ్ళాడనీ, దీన్ని పెద్ద వార్తలు చేసి మీడియా వాళ్ళు ప్రచారం చేశారని అన్నారు. ఆయన సతీమణి సుహాసినితో కలిసి మణిరత్నం ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. సాధారణ హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయించుకుంటున్నారని, అది చెన్నైలో అయితే, ఇలాంటి పుకార్లు వస్తాయనే ఉద్దేశంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకున్నారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మన్యన్ అన్నారు. గతంలో రెండుసార్లు యువ, రావణ్ చిత్రాల షూటింగ్ సమయంలో మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చిన విషయం తెల్సిందే!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ