సర్దార్ ఆడియోతో చెక్ పెడతారంట

February 19, 2016 | 12:23 PM | 5 Views
ప్రింట్ కామెంట్
mega-family-at-sardar-audio-function-niharonline

మెగా ఫ్యామిలీ అభిమానులకు పెద్ద శుభవార్త. దూరం పెరిగిందంటూ వార్తలు వచ్చిన సందర్భంలో ఒకరి సెట్లోకి ఒకరు వెళ్లటం ద్వారా అలాందేం లేదనే సంకేతాలు పంపుకున్నారు మెగా హీరోలు. ఇక ఇఫ్పుడు గొడవలు ఉన్నాయన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ ఫ్యామిలీ రెడీ అవుతోంది. దీనికోసం ఓ మెగా ఈవెంట్ వేదిక కానుందని సమాచారం. అదే సర్దార్ ఆడియో వేడుక.

పవన్ కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. అంతేకాదు కథ కూడా పవన్ కళ్యాణే అందించటం విశేషం. ఇక ఈ మధ్యే సెట్ కి వెళ్లి సందడి చేశాడు మెగాస్టార్ చిరు. దీంతో మెగా ఫ్యామిలీలోని కుర్రహీరోలతో సహా మెగా అన్నదమ్ములు ముగ్గురు చిత్ర ఆడియోకు హాజరుకావాలని పవన్ డిసైడ్ అయ్యాడంట. ఇదే విషయాన్ని మరో నిర్మాత శరత్ మరార్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపించారు. ఆ సినిమా పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా బ్రదర్స్ కలయిక కలిసొస్తుందని భావిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత వస్తున్న పవర్ స్టార్ సినిమా కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. అదే ఊపులో ప్రీ బిజినెస్ కూడా భారీ మొత్తంలోనే జరిగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించి చాలా కాలం కావటంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. వీరితోపాటు రాంచరణ్, అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ లతోపాటు మెగాడాటర్ నిహారికను కూడా ఫంక్షన్ కి హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడంట పవన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ