క్రిష్ సెంటిమెంట్ తో బాలయ్య చాలా కష్టం

February 20, 2016 | 03:33 PM | 2 Views
ప్రింట్ కామెంట్
krish-balayya-movie-doubt-niharonline

బాలయ్య వందో సినిమా పై చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. డైరక్టర్లందరి పేరు వరుసపెట్టి వినిపిస్తున్నాయి. దీనికి కారణం రోజుకో దర్శకుడు ఆయన్ను కలవటం. అయితే అది కథ కోసమో లేక మరేయితర విషయం కోసమో తెలీదు కానీ, అంతా సెంచరీ కోసమే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి, సింగీతం, అనిల్ రావిపూడి,  క్రిష్. కృష్ణవంశీ ఇలా లిస్ట్ చాంతాడంత ఉంది.

         అయితే వీరిలో క్రిష్ జానపద నేపథ్యంలోనే ఓ కథాంశం వినిపించాడని, అది బాలయ్యకి బాగా నచ్చిందని చెప్పుకుంటున్నారు. బేసిక్ లైన్ నచ్చిన బాలయ్య దాన్ని డెవలప్ చేసుకుని రావాల్సిందిగా క్రిష్ కి సూచించాడంట. దీంతో స్టోరీ డెవలప్ చేసే పనిలో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు వీరి కాంబినేషన్ అసలు సెట్ అవుతుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ కి తెరలేపారు. క్రిష్ తీసింది నాలుగు సినిమాలే. అందులో గమ్యం, వేదం, కంచె మూడు హిట్ టాక్ తోపాటు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఇక మిగిలిన చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్ అట్టర్ ఫ్లాప్. కథాబలం ఉన్నప్పటికీ ఎందుకనో ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే మిగిలిన మూడు చిత్రాల సెంటిమెంట్ కాస్త కలవరపెడుతుంది. ఆ మూడు చిత్రాల్లో హీరో చివర్లో చనిపోతాడు. మూడు హిట్ అయ్యాయి. మరి బాలయ్యతో సినిమా అంటే అలాంటి వేషాలు అస్సలు కుదరవు. మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యతో క్లాసిక్ డ్రామాలు వేయిస్తే ఖచ్ఛితంగా బెడిసి కొడుతుంది. ఒకవేళ కుదిరినా క్రిష్ కి ఓ బడా హీరోని హ్యాండిల్ చేయగలడా, ఆయన అభిమానులను మెప్పించే కెపాసిటీ ఉందా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అనుమానాలు. వీటికి సమాదానం దొరకాలంటే వందో చిత్రం అనౌన్స్ మెంట్ అయ్యేదాకా ఆగాల్సిందే.      

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ