గోపాలుడికి పూజలు చేసేస్తారట

November 29, 2014 | 11:31 AM | 30 Views
ప్రింట్ కామెంట్

తాము అమితంగా అభిమానించే వ్యక్తులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఒకదశలో అది శ్రుతి మించి వారికి గుళ్లు కట్టి ఏకంగా పూజలు చేయడంలాంటివి తమిళనాడులో సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే, తాజాగా ఇదే తరహా విపరీతాభిమానం ఏపీకి కూడా పాకింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయన అభిమానులైన తాడేపల్లిగూడెంకు చెందిన డాక్టర్ అరుణ ప్రసాద్, కరుణాకర్ లు ఈ విగ్రహాన్ని రూ. 2 లక్షలు ఖర్చు చేసి తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పవన్ ను ఆహ్వానించాలని వారు భావిస్తున్నారు. మరి పవన్ వీరి చిరు కోరికను మన్నిస్తారా?. లేక ‘‘అభిమానం వెర్రి తలలు వేసిన ఫ్యాన్స్’’ అని లైట్ తీసుకుంటారో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ