అక్కడ సైతం దుమ్ము లేపుతారట

November 25, 2014 | 12:06 PM | 40 Views
ప్రింట్ కామెంట్

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మేమున్నామంటూ ప్రతీసారి ముందుకు వచ్చి చేయూతనిచ్చే తెలుగు చిత్ర పరిశ్రమ మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవల హుద్ హుద్ తుఫాన్ నష్టంతో తీవ్రంగా నష్టపోయిన విశాఖను ఆదుకునేందుకు ‘మేము సైతం-వీ లవ్ వైజాగ్’ పేరిట ఈ నెల 30న ఓ మెగా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ రూపకల్పన చేసుకున్నారు కూడా. ఫన్నీ స్కిట్లు, క్రికెట్ మ్యాచ్, అంత్యాక్షరి లాంటి వినోదాత్మక కార్యక్రమాలతో అలరించనున్నారు. ఎప్పుడూ ఇలాంటి వేదికలపై కనిపించని మహేష్, పవన్ లు కూడా తమ సంప్రదాయాలను పక్కనబెట్టి ఈ సత్కాకార్యం కోసం ముందుకు రానున్నారు. వీరి కోసం మాటల దర్శకుడు త్రివిక్రమ్ స్కిట్లను ఇప్పటికే సిద్ధం చేశాడట. అత్తారింటికి దారేది చిత్రంలోని ‘అహల్య’ స్కిట్ తరహాలోనే మహేష్, సమంతలు ఓ స్కిట్ చేయనున్నారని సమాచారం. అలాగే పవన్ తో కూడా మాటల మ్యాజిక్ చేయించేందుకు ఓ టాక్ షోని కూడా సిద్థం చేశాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు వీటికి పోటీగా జక్కన టీం ముందుకొచ్చింది. బహుబలి చిత్ర యూనిట్ కూడా ఈ వేదికపై అలరించనుందని తాజా సమాచారం. ప్రభాస్, రానా, అనుష్క, సంగీత దర్శకుడు కీరవాణి కలిసి ఓ ఫన్నీ స్కిట్ తో అలరిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు హీరోల స్కిట్ లు స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు అడ్రస్ కాబోతున్న వైజాగ్ భవిష్యత్ కోసం ఇలా స్టార్ లంతా కృషి చేయడం శుభపరిణామమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ