నిర్మాతలు లేనిపోని నిందలేస్తున్నారు

November 24, 2014 | 02:36 PM | 43 Views
ప్రింట్ కామెంట్

తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో తప్ప మిగతా భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం, అపై టాప్ హీరోయిన్లు అయిపోవడం సహాజమే. అలాంటి లిస్ట్ లో ఉన్న మరో అమ్మాయి శ్రీదివ్య. రవిబాబు దర్శకత్వంలో మనసారా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ పదహారణాల చిన్నది ఇప్పుడు కాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో శ్రీ దివ్య తమను టార్చర్ చేస్తుందని నిర్మాతలు సినీ మండలిలో ఫిర్యాదు చేశారట. దీంతో దివ్య చాలా ఫీలయిపోతుంది. ‘వారు చేప్పేవన్నీ అబద్ధాలే. పారితోషకం విషయంలో తాను ఎలాంటి గొడవలు చేయట్లేదు. నాపై లేనిపోనివి ఫిర్యాదు చేయడం సమంజసం కాదు’ అని వాపోయింది. తాను అన్నీ చిత్రాలకు సహకరిస్తున్నానని తెలిపింది. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో తొలి హిట్ అందుకున్న శ్రీదివ్య ప్రస్తుతం అరకోటిపైగా రెమ్యూనరేషన్ అందుకునే బిజీ హీరోయిన్. రెండేళ్ల క్రితం శ్రీ దివ్య హీరోయిన్ గా నటిస్తున్న కాటుమల్లి అనే చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడి చిత్రంలో తిరిగి నటించేందుకు శ్రీదివ్య ప్రస్తుతం తీసుకునే రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందని నిర్మాతలు ఫిర్యాదుచేశారు. ఇక శ్రీదివ్యేమో తాను అమాయకురాలినని, ఇలాంటివి తనకు చాతకావని భాదపడుతోంది. అరవ నిర్మాతల్లారా... అన్నన్నీ హిట్లు అందిస్తున్న ఈ తెలుగు అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం సబబేనా?.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ