రామ్ చేసేది ముమ్మాటికి రిస్కే

February 11, 2016 | 02:36 PM | 6 Views
ప్రింట్ కామెంట్
ram-ready-for-ready-sequel-srinu-vaitla-direction-niharonline

చాలా గ్యాప్ తర్వాత 'నేను శైలజ' తో బ్లాక్ బస్టర్ కొట్టాడు యంగ్ హీరో రామ్. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో తన తదుపరి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తిరిగి హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల తోనే చేద్దామనుకుంటున్నప్పటికీ అది కుదరకపోవటంతో మరో అగ్రదర్శకుడితో కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగడు, బ్రూస్ లీ ప్లాప్ లతో ఢీలా పడిపోయిన శీనువైట్లతో సినిమాకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే శీనుపై నమ్మకంతో రిస్క్ చేసేందుకు రామ్ సిద్ధమౌతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

                                రామ్ వైట్లతో ఓకే చెప్పింది హిట్ మూవీ రెడీకి సీక్వెల్ అని సమాచారం.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'రెడీ' అప్పట్లో ఘనవిజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. ఆపై ఇదే తరహా కాన్సెప్ట్ తో మరెన్నో సినిమాలు వచ్చేంతగా ఇది ప్రభావితం చేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే మరో హిట్ దొరకడం ఖాయమనే ఆలోచనలో రామ్ రంగంలోకి దిగాడని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి శ్రీను వైట్ల కథ రెడీ చేయించడం, అది రామ్ కి నచ్చేయడం కూడా జరిగిపోయిందని సమాచారం. అయితే తెలుగు సినిమాల్లో సీక్వెల్ చిత్రాలు హిట్ అయిన దాఖలాలు లేవు. ఆర్య-2, శంకర్ దాదా జిందాబాద్, రక్తచరిత్ర-2 ఈ కోవలోకే వస్తాయి. మరి టాలీవుడ్ లో సీక్వెల్ లు అంతగా ఆడని చరిత్ర ఉండగా రామ్ చేయబోయేది నిజంగా పెద్ద రిస్కే అవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ