సమంత మూడుతో సరిపెట్టుకుంది

March 01, 2016 | 12:03 PM | 3 Views
ప్రింట్ కామెంట్
samantha_twitter_followers_2miilion_niharonline

చెన్నై సుందరాంగులు ముందు అక్కడ సక్సెస్ రేటు చవిచూసి, ఆ తర్వాత తెలుగులోకి వచ్చి దుమ్మురేపి ఎలటం కామనే. కానీ, సమంత మాత్రం పూర్తిగా రివర్స్. తమిళ్ లోని చేసిన రెండు చిత్రాలు ఫ్లాప్ అవటంతో, తెలుగులోకి వచ్చి ఒక్క సినిమాతో ఫేట్ మార్చుకుని, ఆపై వరుసగా బడా హీరోలతో కానిచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తమిళ్ కి వెళ్లి, అక్కడ హిట్ రేట్ పెంచుకుని ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ని మాత్రం అస్సలు దూరం చేసుకోదు సమంత. కాస్త గ్యాప్ ఇచ్చిందంటే. చాలు... ఆమె ఫ్యాన్స్ బెంగపడిపోతారు. అలాంటి సమంత సోషల్ మీడియాలో కొత్తగా ఒక మైలురాయిని చేరుకుంది. ట్విట్టర్లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్ మార్క్ ను క్రాస్ అయింది.  తద్వారా సౌత్ ఇండియన్ కథానాయికల్లో 2 మిలియన్ మార్క్ కి చేరుకున్నవారిలో సమంతా మూడవ స్థానంలో నిలిచింది.

ఈ లిస్ట్ లో కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్(3.4 మిలియన్ ఫాలోవర్స్ తో) మొదటిస్థానంలో వుండగా, త్రిష( 2.4 మిలియన్ ఫాలోవర్స్ తో) రెండవస్థానంలో వుంది. తాజాగా 2 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన సమంతా, మూడవ స్థానంలో నిలిచింది. శృతీ కోలీవుడ్, టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ బిజీ నాయిక, ఇక త్రిష కోలీవుడ్, టాలీవుడ్ ను పదేళ్లు ఏలింది. వీరిద్దరితో పోలిస్తే తమిళ్ లో సమంతకు క్రేజ్ అంత ఏం ఎక్కువ కాదు. సో... సోలోగా ఎక్కవ తెలుగు అభిమానుల ద్వారానే సమంత ఈ ఫీట్ ను సాధించిందన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ