కట్టప్ప కొడుకు తెలుగు హిట్ పై కన్నేశాడు

April 23, 2016 | 03:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kshanam-tamil-remake-sibiraj-niharonline

తమిళ నటుడు సత్యరాజ్ అలియాస్ కట్టప్ప. 80, 90వ దశకంలో స్టార్ హీరోగా చెలామణి అయిన సత్యరాజ్ ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు. ఈ మధ్య వస్తున్న పలు చిత్రాల్లో ఆయన కీలక పాత్రధారి. ముఖ్యంగా కోలీవుడ్ లో కన్నా తెలుగులోనే ఆయనకు మంచి పాత్రలు పడుతున్నాయి. అయితే ఆయన నటవారసుడిగా వచ్చిన శిబిరాజ్ మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేకపోయాడు.

                                 దాదాపు 13 సంవత్సరాల నుంచి 10 చిత్రాల్లో హీరోగా చేసినప్పటికీ ఇప్పటిదాకా ఒక్క హిట్ ను కూడా అందుకోలేకపోయాడు. దీంతో సపోర్టింగ్ క్యారెక్టర్ లోనైనా అదృష్టం పరిశీలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. జీవా హీరోగా వస్తున్న పోకిరి రాజాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు సోలో హీరోగా ప్రయత్నాలు మాత్రం మానటం లేదు. తాజాగా తెలుగులో హిట్ అయిన క్షణం సినిమా రీమేక్ రైట్స్ ను పీవీపీ బ్యానర్ దగ్గరి నుంచి కొనేసుకున్నాడంట. తానే హీరోగా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడంట.  అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం చిన్న బడ్జెట్ తో రూపొంది భారీగా లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సినిమాతోనైనా శిబిరాజ్ హిట్ అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ