తెలుగు సినిమా నటి బిందు మాధవి శుక్రవారం కన్నుమూసారు. ఈమె కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బిందు మాధవి మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడంతో పాటు, టీవీ సీరియళ్లలో ఆమె నటించారు. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్ సాయం అందజేశారు. ఆమె ఈ మధ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చాతి, గుండె సంబంధమైన వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొంత కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. కాగా శుక్రవారం ఆమె మృతిచెందారు.