నాగ్ కు జోడీగా శృతిహాసన్?

November 25, 2014 | 02:45 PM | 38 Views
ప్రింట్ కామెంట్

అవకాశాలు లేనప్పుడు దొరికిందాన్ని అందిపుచ్చుకోవడంలో కమల్ గారాలపట్టి, నటి శృతిహాసన్ ది అందెవేసిన చెయ్యి. కుర్రహీరోలతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ గ్యాప్ లో పెద్ద హీరోలతో కూడా కానిచ్చేస్తుంది. రవితేజతో బలుపులో నటించిన ఈ భామ ఇప్పుడు మహేష్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇక లేటేస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగ్ తో జతకట్టే ఛాన్స్ దక్కింది. వంశీపైడిపల్లి డైరక్షన్ లో కింగ్ నాగార్జున, తమిళ నటుడు కార్తీ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా శృతిహాసన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రానికి తమన్నాను హీరోయిన్ గా ఎంపికచేశారట. అయితే మిల్కీబ్యూటీ చిత్రాలు వచ్చినవి వచ్చినట్లుగా వరుసగా ఫ్లాప్ లు అవుతుండటంతో ఇప్పుడా గాలి శృతి వైపు మళ్లీందని సమాచారం. ఈ ఏడాది వంశీపైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన ఎవడు చిత్రంలో శృతి చరణ్ కి జోడీగా నటించింది. దీంతో వంశీ డైరక్షన్ లో నటించే మరో అవకాశం శృతిహాసన్ కి దక్కనుంది. మరి మన్మథుడితో రొమాన్స్ కి శృతి ఓకే చెబుతుందంటారా?.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ