‘మేము సైతం’లో పూర్తిస్థాయి అటెండెన్స్ వెంకీదే...

December 01, 2014 | 05:56 PM | 34 Views
ప్రింట్ కామెంట్

‘మేము సైతం’లో కాస్తయినా కెమెరాకు కనుమరుగు కాకుండా అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ కనిపించిన వ్యక్తి వెంకటేష్. ఆర్టిస్టులు చేసే ప్రతి పెర్ఫార్మెన్స్ కు స్పందిస్తూ తెరమీద కనిపించారు. చాలా మంది ఒక గంట రెండు గంటలు వాళ్ళ స్కిట్ చేసి వెళ్లి పోయారు. చిరంజీవి, బాల కృష్ణ ఉదయం వచ్చి వెళ్లిపోయి మళ్ళీ సాయంత్రం కనిపించారు. నాగార్జున కూడా రెండు గంటలు తన ప్రోగ్రాం ముగించుకుని వెళ్లిపోయారు. పవన్ కళ్యాన్ అభిమానులను నిరాశపరుస్తూ ఈ ప్రోగ్రాంకు గైర్హాజర్ అయ్యారు. ఇక మహేష్ తన ఇంటర్వ్యూ స్కిట్ అయ్యిందనిపించి వెళ్లిపోయారు. ఉధూద్ కు లక్షల విరాళాలు ఇచ్చారు కానీ తమ హీరోను 12 గంటల పాటు చూసుకోవాలనుకున్న అభిమానుల కోరికను మాత్రం తీర్చలేకపోయారు. వెంకటేష్ మాత్రం అలా కాకుండా ఇటు క్రికెట్ టీమ్ లీడర్ గా హీరో అనిపించుకున్నారు. అటు కబడ్డీ ఆటగాళ్లనూ ఉత్సాహ పరుస్తూ రెఫరీ మోహన్ బాబుపై సెటైర్లు విసురుతూ కనిపించారు. ఇక స్టేజ్ పెర్ఫార్మెన్స్ అన్నిటినీ మిస్ చేయకుండా ఎంటర్ టైన్ చేశారు. తన దైన సినిమా స్టైల్ లో అభిమానులనూ, నటులనూ ఉత్సాహ పరుస్తూ కనిపించారు. ఇక చివర్లో జరిగిన అంత్యాక్షరిలో ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పాటల లిరిక్స్ రాకపోయిన ఏదో నోరు కదిపేస్తూ, ఇతర టీమ్ లను అదిరిస్తూ, బెదిరిస్తూ, అల్లరి చేస్తూ నవ్వుల్ని పంచారు. ఇక చిరంజీవిని స్టేజ్ పైకి లాక్కువెళ్ళి స్టెప్పులు వేయించారు కూడా. చిరంజీవి స్టేజ్ పైనుంచి కిందికి దిగి, చాన్నాళ్ళ తరువాత నన్నుమళ్లీ స్టేజీ ఎక్కించి డాన్స్ చేయిస్తావా? అంటూ ముద్దుగా చివాట్లు వేశారు. మేము సైతం కార్యక్రమాన్ని పూర్తిగా ఎంటర్ టైన్ చేసిన వ్యక్తిగా అందరి మదిలో నిలిచిపోయారు వెంకీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ