మీడియా వేణు మాధవ్ ని చంపేసింది

May 10, 2016 | 02:00 PM | 3 Views
ప్రింట్ కామెంట్
venu-madhav-died-fake-news-niharonline

నిజమో కాదో కన్ఫర్మ్  చేసుకోకుండా వార్తలు ప్రసారం చేసి నాలిక కరుచుకోవటం మన మీడియాకు కామనే. తమిళ్ సీనియర్ కమెడియన్ సెంథిల్ చనిపోయారంటూ రెండు రోజుల క్రితం వార్తలు రాగా, తాను బతికే ఉన్నాను బాబోయ్ అంటూ సెంథిల్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కోవలో టాలీవుడ్ హస్యనటుడిని చంపేశాయి. కమెడియన్ వేణు మాధవ్ చనిపోయారంటూ ఈ రోజు ఉదయం ఓ ప్రముఖ టీవీ ఛానెల్, రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లు కథనాలు ప్రసారం చేశాయి. దీంతో షాక్ తిన్న ఆ కమెడియన్ నేరుగా పోలీసులకు పిర్యాదు చేసి తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తన మరణంపై వార్తలు ప్రసారం చేసిన టీవీ ఛానెల్, సోషల్ మీడియా వెబ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలో అనారోగ్యంతో ఆయన కొంత కాలం సినిమాలకు దూరంకాగా, అప్పుడు కూడా ఆయన ఆరోగ్యస్థితిపై మీడియా లేనిపోని కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ