సమిష్టి కృషి కన్నా అభిమానుల అండే ఎక్కువ

January 30, 2016 | 12:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Dhoni thanks Indian supporters at packed MCG niharonline

మెల్ బోర్న్ రెండో టీట్వంటీ సందర్భంగా ఇక్కడి అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఆడుతున్నంత సేపు తమ గోలలతో, ఈలలతో తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపోందించారని మీడియా సమావేశంలో ధోనీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాల్లో ఆడే సమయంలో భారత జట్టుకు విదేశాల్లో ఆడుతున్న ఫీలింగ్ రాదని, సొంత దేశంలో ఆడుతున్న భావన ఉంటుందని అన్నాడు. ఫీల్డింగ్ తప్పిదాలు నిరాశకు గురి చేసినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో విజయం సిద్ధించిందని ధోనీ చెప్పాడు.

             విజయం ఆనందాన్ని ఇస్తుందని, తాను కూడా జట్టు ప్రదర్శన గాడిన పడడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ధావన్, రోహిత్, కోహ్లీ నిలదొక్కుకుంటే విధ్వంసమేనని చెప్పిన ధోనీ, ఆ ముగ్గురూ రాణించడం వల్ల సునాయాసంగా గెలుపొందామని చెప్పాడు. పాండ్య పరుగులిచ్చినా కీలక సమయంలో వికెట్ తీశాడని అన్నాడు. జడేజా పట్టిన వాట్సన్ క్యాచ్ అద్భుతమని ధోనీ తెలిపాడు. ఫించ్ బాగా ఆడాడని ధోనీ కితాబునిచ్చాడు. మూడో టీట్వంటీలో కూడా విజయం సాధించాలని ధోనీ కాంక్షించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ