టీమిండియా ఓటమిపై వార్న్ ఏమన్నాడంటే...

April 02, 2016 | 05:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
shane-warne-on-india-team-lost-niharonline

వరల్డ్ టీ 20 టోర్నీకి ముందు టీమిండియాను టైటిల్ ఫేవరెట్ గా భావించినా ఆ జట్టు సెమీ ఫైనల్లో కొన్ని తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు కొన్ని మౌలిక విషయాలను అమలు చేయడంలో విఫలమై ఓటమి పాలైందన్నాడు.

                                ' టోర్నమెంట్‑కు ముందు టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అనుకున్నా. కాకపోతే నాకౌట్ స్టేజ్ లో ఆ జట్టు కొన్ని తప్పులు చేసింది.  ప్రత్యేకంగా నోబాల్స్ వేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ మ్యాచ్ లో ధోని సేన నమోదు చేసిన 193 పరుగులు మంచి స్కోరే.  దాంతో పాటు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ను తొందరగా పెవిలియన్ కు పంపడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించా. కానీ టీ 20ల్లో ఏదైనా జరగొచ్చు.  విండీస్ అద్భుతమైన విజయంతో క్రెడిట్ ను సొంతం చేసుకుంది' అని వార్న్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో స్థానంలో విరాటే అత్యుత్తమ ఆటగాడని వార్న్ కొనియాడాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ