సొంత మైదానంలో ఢిల్లీకి షాక్... నైట్ రైడర్స్ ఘనవిజయం

April 21, 2015 | 10:32 AM | 45 Views
ప్రింట్ కామెంట్
gambhirkkr_win_over_delhi_niharonline

సొంత స్టేడియం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. ఐపీఎల్ 8 లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెలరేగిన కోల్ కతా బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి, కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 147 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే వికెట్లు పడ్డా, కెప్టెన్ గంభీర్(60), యూసఫ్ పఠాన్ (40) చెలరేగటంతో కోల్ కతా సునాయసంగానే విజయం సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ