భారత్-పాక్ మ్యాచ్... అలరించనున్న అమితాబ్

February 02, 2015 | 04:24 PM | 32 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ త్వరలో క్రికెట్ కామెంటెటర్ అవతారం ఎత్తనున్నాడు. వరల్డ్ కప్ 2015 ఫిబ్రవరి 15న జరగబోయే భారత్-పాక్ మ్యాచ్ కు హర్ష బోగ్లే, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తో కలిసి బిగ్ బీ మైక్ పట్టనున్నాడని సమాచారం. ఇరుదేశాల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కు ఎంత క్రేజో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు అమ్ముడు పోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి దాదాపు వంద కోట్ల మంది ఈ మ్యాచ్ ని వీక్షించబోతున్నారని ఓ అంచనా. ఇప్పటి వరకు సినిమాలకు పలు కార్యక్రమాలకు తన కంచు స్వరాన్ని అందించిన అమితాబ్ ఇప్పుడు క్రికెట్ కామెంటరీ ద్వారా క్రికెట్ అభిమానులను అలరించనున్నారు. అన్నట్లు బిగ్ బీ కూడా మాంచి క్రికెట్ ప్లేయరేనండోయ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ