సెల్ఫీ చావులు ఎక్కువ ఏదేశంలోనంటే...

February 10, 2016 | 05:40 PM | 2 Views
ప్రింట్ కామెంట్
selfie-deaths-more-in-world-india-2015-niharonline

సోషల్ మీడియా  పైత్యంతో అప్ లోడ్ చేసేందుకు చిత్ర విచిత్రమైన ఫోజులతో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య భారతదేశంలోనే అధికంగా ఉంది. ఈ విషయాన్ని స్టాటిస్తా అనే సంస్థ వెల్లడించింది. సెల్ఫీలు దిగేవారు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు, సెల్ఫీలు దిగుతున్న సందర్భాల్లో ఏకారణల వల్ల చనిపోయారు అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ప్రపంచం మొత్తంలో చూస్తే సెల్ఫీల కారణంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య భారత్ లోనే అధికంగా ఉందని వెల్లడించింది.

                        2012 నుంచి 2014 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మృతుల సంఖ్య 49. మృతులందరూ 21 సంవత్సరాలలోపు వారే. అందులో 36 మంది అబ్బాయిలు కాగా, 13 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ జాబితా వివరాలు..భారత్ (19), రష్యా(7), అమెరికా(5), స్పెయిన్(4), ఫిలిప్పీన్స్(4), పోర్చుగల్(2), ఇండోనేషియా(2), దక్షిణాఫ్రికా(1), రొమానియా(1), పాకిస్థాన్(1), మెక్సికో(1), ఇటలీ(1), చైనాలో ఒక్కరు మృతి చెందారు. కాగా, ఈ నలభై తొమ్మిది మందిలో చాలా ఎత్తులో నుంచి పడిపోయి, నీటిలో మునిగిపోయి, కారు, రైలు, విమాన ప్రమాదాల్లో, తుపాకీ, జంతువుల కారణంగా తమ ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఎత్తు నుంచి కింద పడిపోవడంతో ఎక్కువ మంది చనిపోవడం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ