టైం మ్యాగజైన్‌ ఓటింగ్‌ మోడీనే టాప్‌!

December 06, 2014 | 04:57 PM | 46 Views
ప్రింట్ కామెంట్

ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ ఓటింగ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే టాప్‌లో నిలిచారు. టైమ్‌ నిర్వహిస్తున్న పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఓటింగ్‌లో మళ్లీ మోడీనే మొదటిస్థానం ఆక్రమించారు.మూడురోజుల్లో ముగియనున్న ఓటింగ్‌ అనంతరం పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను పత్రిక ప్రకటించనుంది.అమెరికాలో నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీస్‌ అధికారి అన్యాయంగా కాల్చిచంపటంపై పెద్దపెట్టున ఆందోళన నిర్వహిస్తున్న ఫెర్గూసన్‌ ఆందోళకారులకు పోల్‌లో భారీగా మద్దతు రావటంతో మోడీ కొద్దిరోజులు రెండోస్థానానికి పడిపోయారు. అయితే, 12.8 శాతం ఓట్లతో తాజా ఓటింగ్‌లో మోడీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారని టైమ్‌ పత్రిక ప్రకటించింది. 10.1 శాతం ఓట్లతో ఫెర్గూసన్‌ ఆందోళకారులు రెండోస్థానంలో ఉండగా హాంకాంగ్‌ ప్రజాస్వామ్య ఉద్యమకారుడు జోషువా వాంగ్‌ 7.5 శాతం ఓట్లతో మూడోస్థానంలో, పాకిస్థాన్‌ బాలిక మలాలా నాలుగోస్థానంలో ఉన్నారని తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ