ఆ పని చేయండి... పీడ విరగడైపోతుంది

December 22, 2014 | 05:46 PM | 43 Views
ప్రింట్ కామెంట్

పాకిస్థాన్ చరిత్రలో ప్రభుత్వం తొలిసారిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన పాశవిక దాడితో ఆ దేశం కళ్లు తెరిచింది. దీంతో ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఉగ్రవాదులపై దాడులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో త్వరలోనే సుమారు 500 మంది ఉగ్రవాదుకు ఉరిశిక్ష అమలు చేస్తామని పాకిస్థాన్ మంత్రి ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు శిక్షలను వేగవంతం చేయనున్నామని పాక్ స్పష్టం చేసింది. పాక్ మంత్రి ప్రకటన వాస్తవరూపం దాలిస్తే, ప్రపంచ ఉగ్రవాద సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే. తీవ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ లో కఠిన చర్యలు తీసుకుంటే తీవ్రవాదులకు స్థానం లేనట్టే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ